ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- June 06, 2026
మనామా: ఇరాన్ తాజా దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. "భద్రత క్షిపణులు లేదా డ్రోన్లతో నిర్మించబడదు" అని పేర్కొంది. "సహనం బలహీనతకు సమానం కాదు" అని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.
అంతకుముందు కువైట్ మరియు బహ్రెయిన్ వైపు ప్రయోగించిన ఏడు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్టు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా క్షిపణులు, డ్రోన్లతో భద్రతను నిర్మించలేమని, అలాగే మందుపాతరలు పాతడం ద్వారా స్థిరత్వాన్ని కాపాడలేమని బహ్రెయిన్ పేర్కొంది. సముద్రంలోని మందుపాతరల స్థానాలను వెల్లడించాలని, వాటిని తొలగించడంలో సహకరించాలని ఇరాన్ను కోరింది. అన్యాయమైన దాడులను తక్షణమే నిలిపివేసి, శాంతిని స్వీకరించాలని ఇరాన్కు పిలుపునిచ్చింది.
ఇరాన్ తాజా దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే స్పష్టమైన దురాక్రమణ అని, అరేబియా గల్ఫ్ ప్రాంత భద్రత, స్థిరత్వానికి ముప్పు అని అభివర్ణించింది.
20 వేలమందికి పైగా నావికులు చిక్కుకుపోయిన నేపథ్యంలో, పౌర నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇచ్చే సురక్షిత మానవతా కారిడార్ను తెరవాలని, అలాగే నావికులు బయలుదేరి వారి కుటుంబాల వద్దకు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని బహ్రెయిన్ ఇరాన్కు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం







