ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- June 06, 2026
మనామా: ఇరాన్ తాజా దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. "భద్రత క్షిపణులు లేదా డ్రోన్లతో నిర్మించబడదు" అని పేర్కొంది. "సహనం బలహీనతకు సమానం కాదు" అని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.
అంతకుముందు కువైట్ మరియు బహ్రెయిన్ వైపు ప్రయోగించిన ఏడు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్టు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా క్షిపణులు, డ్రోన్లతో భద్రతను నిర్మించలేమని, అలాగే మందుపాతరలు పాతడం ద్వారా స్థిరత్వాన్ని కాపాడలేమని బహ్రెయిన్ పేర్కొంది. సముద్రంలోని మందుపాతరల స్థానాలను వెల్లడించాలని, వాటిని తొలగించడంలో సహకరించాలని ఇరాన్ను కోరింది. అన్యాయమైన దాడులను తక్షణమే నిలిపివేసి, శాంతిని స్వీకరించాలని ఇరాన్కు పిలుపునిచ్చింది.
ఇరాన్ తాజా దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే స్పష్టమైన దురాక్రమణ అని, అరేబియా గల్ఫ్ ప్రాంత భద్రత, స్థిరత్వానికి ముప్పు అని అభివర్ణించింది.
20 వేలమందికి పైగా నావికులు చిక్కుకుపోయిన నేపథ్యంలో, పౌర నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇచ్చే సురక్షిత మానవతా కారిడార్ను తెరవాలని, అలాగే నావికులు బయలుదేరి వారి కుటుంబాల వద్దకు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని బహ్రెయిన్ ఇరాన్కు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







