ఫిలిప్పీన్స్లో ఘోర భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత..
- June 08, 2026
దక్షిణ ఫిలిప్పీన్స్ను సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ ఉదంతంతో తీరప్రాంత నగరాలు ఒక్కసారిగా కుదిపివేయబడటంతో భారీగా ఆస్తినష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా సుమారు 7 లక్షల జనాభా కలిగి, ట్యూనా ప్రాసెసింగ్ పరిశ్రమకు నిలయమైన జనరల్ శాంటోస్ నగరం ఈ భూప్రకంపనల ధాటికి తీవ్రంగా ప్రభావితమైంది.
శాస్త్రవేత్తల వివరాల ప్రకారం..జనరల్ శాంటోస్ నగరానికి నైరుతి దిశగా 8 మైళ్ల దూరంలో, భూగర్భంలో 6.2 మైళ్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ భారీ భూకంపం(Philippines Earthquake) కారణంగా అక్కడి జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం అందింది. భూకంపం సృష్టించిన భయాందోళనల నేపథ్యంలో, ఫిలిప్పీన్స్ తీరంలో సుమారు 10 అడుగుల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు ఈ భూకంప ప్రభావంతో పసిఫిక్ సునామీ సెంటర్ కూడా అప్రమత్తమైంది. ఇండోనేషియా, మలేసియా దేశాల్లో 3 అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని, అలాగే తైవాన్, జపాన్, పపువా న్యూ గునియా దేశాలు కూడా దీనివల్ల ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఫిలిప్పిన్స్ తీర ప్రాంతాల్లో మూడడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







