ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!
- June 08, 2026
రియాద్: ఏడు ఒపెక్+ దేశాలు జూలైలో తమ ఉమ్మడి ముడి చమురు ఉత్పత్తి లక్ష్యాలను రోజుకు 1,88,000 బ్యారెళ్ల (bpd) మేర పెంచడానికి అంగీకరించాయి. ఈ మేరకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా మరియు ఒమన్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కూటమి నెలవారీగా కోటాను పెంచడం ఇది నాలుగోసారి. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ప్రస్తుతం ఈ బ్యారెళ్ల లభ్యత పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు ఏడు ఒపెక్+ దేశాలు తమ ఉత్పత్తి కోటాలను రోజుకు దాదాపు 600,000 బ్యారెళ్ల మేర పెంచాయి. ఆయిల్ మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయంలో భాగంగా, ఏప్రిల్ 2023లో ప్రకటించిన అదనపు స్వచ్ఛంద సర్దుబాట్ల నుండి రోజుకు 188,000 బ్యారెళ్ల ఉత్పత్తి సర్దుబాటును అమలు చేస్తున్నారు. ఈ సర్దుబాటు వచ్చే నెల నుండి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..







