రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- June 10, 2026
జెడ్డా: రబీగ్ గవర్నరేట్ తీరంలో ఎడుగురిని భద్రతా దళాలు రక్షించాయి. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వారి నౌకలో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది. సమాచారం అందుకున్న మక్కా సరిహద్దు రక్షక దళానికి చెందిన సహాయక బృందాలు ఏడుగురిని గుర్తించి విజయవంతంగా రక్షించాయి.
రెస్క్యూ చేసిన వారిలో ఆరుగురు సౌదీ పౌరులు మరియు ఒక ఈజిప్టు నివాసి ఉన్నారని సరిహద్దు రక్షక దళ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది. సముద్ర ప్రయాణంలో భద్రతా నిబంధనలు మరియు సూచనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టరేట్ సూచించింది.
నౌకలను తరచూ చెక్ చేసుకోవాలని, అన్ని వేళలా లైఫ్ జాకెట్లు ధరించాలని మరియు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మక్కా, మదీనా మరియు తూర్పు ప్రావిన్స్ లో 911 అత్యవసర నంబర్కు లేదా ఇతర ప్రాంతాలలో 994 నంబర్ లో సంప్రదించాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







