ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- June 13, 2026
దోహా: ఖతార్ లో విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖల సహకారంతో ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) జనవరి నుండి మే వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్య ప్రచార కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ కార్యక్రమంలోభాగంగా ప్రాథమిక, ప్రిపరేటరీ మరియు సెకండరీ విద్యా దశలలోని 54 పాఠశాలల్లో అనేక రకాల కార్యకలాపాలు నిర్వహించింది. అలాగే ఇందులో తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కార్యకలాపాలు ఉన్నాయి.
ఇలాంటి కార్యక్రమాలు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు సమాజ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ తెలిపారు. విద్యార్థులకు శిక్షణ, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు అర్హత కలిగిన కౌన్సిలర్లను అందించడం ద్వారా సురక్షితమైన మరియు సహాయక విద్యా వాతావరణాన్ని కల్పించడంపై దృష్టి సారిస్తుందని తెలిపారు. వివిధ విద్యా దశలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కవర్ చేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, మానసిక మరియు సామాజిక మార్గదర్శకత్వం అందించడంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక వర్క్షాప్ల ద్వారా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం మరియు వారిలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి పాఠశాలల్లో తల్లిదండ్రుల కోసం వర్క్షాప్లు నిర్వహించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







