ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!
- June 14, 2026
మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా బాధ్యతలు ముగించుకుని వెళ్తున్న జి.వి. శ్రీనివాస్.. భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పుడు పోలీసు ధృవీకరణకు లోబడి కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతోందని ప్రకటించారు. షెరటన్ ఒమన్ హోటల్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన 15 నెలల పదవీకాలాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఒమన్ దేశానికి, అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించచినట్లు పేర్కొన్నారు.
అలాగే, తన పదవీకాలంలో ఒమన్ అధికారులు, ఇండియన్ కమ్యూనిటీ మరియు వివిధ వర్గాల నుండి లభించిన మద్దతును ఆయన గుర్తుచేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ లో జరిపిన విజయవంతమైన పర్యటన తన పదవీకాలంలో ముఖ్య ఘట్టాలలో ఒకటని శ్రీనివాస్ ప్రస్తావించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







