సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- June 14, 2026
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి తెలుగు సంఘాలు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి సీఎంను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని పలకరించి, కొందరితో ఫోటోలు దిగారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ నగరాల సదస్సు (World Cities Summit)లో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆయన సింగపూర్లోని పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.
అలాగే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అక్కడి మంత్రులు, అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుర్బానా-జురాంగ్ ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో వరుసగా చర్చలు జరిపి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







