అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- June 15, 2026
అమెరికా, ఇరాన్ (America-Iran) దేశాల మధ్య రాత్రికి రాత్రే కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ పాలనపై ప్రారంభించిన సైనిక దాడులతో మొదలై, మధ్యప్రాచ్యం అంతటా విస్తరించిన యుద్ధానికి ఈ ఒప్పందంతో అధికారికంగా ముగింపు పడనుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో రాబోయే శుక్రవారం నాడు ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఈ శాంతి వార్తలు వెలువడిన వెంటనే ప్రపంచ ఇంధన మార్కెట్ సానుకూలంగా స్పందించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరుగుతుందనే అంచనాలతో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 4 శాతం మేర పడిపోగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 4.6 శాతానికి పైగా క్షీణించింది. అమెరికాలో నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల ముందు పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న ట్రంప్ ప్రభుత్వానికి ఈ ధరల తగ్గింపు స్వదేశంలో పెద్ద రాజకీయ ఊరటనిచ్చింది.
‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ ఒప్పందాన్ని ధృవీకరించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ ఒప్పందాన్ని ధృవీకరిస్తూ, ఇరాన్పై విధించిన యునైటెడ్ స్టేట్స్ నావికా దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవడానికి పూర్తి అధికారం ఇస్తున్నట్లు చెబుతూ, ప్రపంచ నౌకలన్నీ తమ ఇంజిన్లను స్టార్ట్ చేసి చమురును ప్రవహించనివ్వచ్చని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో రూపుదిద్దుకున్న ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. లెబనాన్తో కూడిన రంగాలు సహా అన్ని ప్రాంతాలలో యుద్ధానికి, సైనిక కార్యకలాపాలకు తక్షణ, శాశ్వత ముగింపు పలకనున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..







