భారత్, రష్యా మైత్రీ యాత్రలో మరో మైలురాయి

- August 10, 2016 , by Maagulf
భారత్, రష్యా మైత్రీ యాత్రలో మరో మైలురాయి

భారత్, రష్యా మైత్రీ యాత్రలో మరో మైలురాయి. భారత్ అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కొత్త అధ్యాయం. తమిళనాడులోని కూడంకుళంలో రష్యా సహకారంతో నిర్మించిన అణువిద్యుత్ కేంద్రం తొలిదశను ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ప్రారంభించారు. మాస్కో నుంచి పుతిన్, ఢిల్లీ నుంచి మోడీ, చెన్నై నుంచి ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేంద్రం ప్రారంభం ద్వారా రష్యాతో మన బంధం మరింత బలపడిందని నరేంద్ర మోడీ చెప్పారు. రష్యన్, తమిళ భాషల్లోనూ ఆయన మాట్లాడారు. శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com