రాఖీ పండుగని సైనికులతో జరుపుకోనున్న స్మృతిఇరానీ
- August 10, 2016
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకొనే రాఖీ పర్వదినాన్ని కేంద్ర మంత్రి స్మృతిఇరానీ మరింత ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. సరిహద్దుల్లో ఉంటూ దేశం కోసం అహర్నిశలు శ్రమించే సైనికులతో ఈ వేడుకలు చేసుకోనున్నారు. రాఖీ పర్వదినాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ హిమనీనదానికి స్మృతి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆగస్టు 18న సియాచిన్ వెళ్లేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నుంచి స్మృతి ఇరానీకి అనుమతి లభించింది.
స్మృతి పర్యటన కోసం ఆర్మీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనుంది. స్మృతి ఇరానీ గాక.. మరో 8 మంది భాజపా మహిళా ఎంపీలు కూడా దేశ సరిహద్దుల్లో రాఖీ పండగ జరుపుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వీరు రాజస్థాన్, కశ్మీర్లలోని సరిహద్దులకు వెళ్లి జవాన్లకు రాఖీ కట్టనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









