సెప్టెంబర్ 2నుంచి ప్రారంభంకానున్నహజ్యాత్ర
- July 25, 2015
ప్రవిత హజ్యాత్ర-2015 సెప్టెంబర్ 2 తేదీ నుంచి మొదలుకానుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ. షూకుర్ తెలిపారు. శనివారం 2015 హజ్ షెడ్యూల్ వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది హజ్ కమిటీ ఇరురాష్ర్టాల నుంచి ఎంపికైన హజ్ యాత్రికులు 16 ఇండియన్ ఎయిర్లైన్ విమానాల ద్వారా వెళ్తారన్నారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు పంపించడం జరుగుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే యాత్రికులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సోమవారం నుంచి నాలుగురోజుల పాటు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హజ్కు వెళ్లే ప్రతీ యాత్రికుడు టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కవర్ నెంబర్ క్రమసంఖ్య ఆధారంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి హజ్ యాత్రకు ఎంపికైన వారికి మాత్రమే టీకాలు ఇస్తామన్నారు. రోజు 500 మంది చొప్పున మూడు రోజులు 1500 మందికి టీకాలు ఇస్తామన్నారు. ఆగస్టు నెలలోని మొదటి వారంలో హజ్ యాత్రికులకు సూట్కేసులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నెలలోనే టెండర్ల్ కమిటీ ద్వారా టెండర్ల ప్రక్రియ, ప్రభుత్వ శాఖ సమన్వయ సమావేశం, హజ్ టర్మిన్ల సందర్శన ఉంటుందన్నారు. ఈ ఏడాది హజ్ క్యాంప్ ఆగస్టు 30వ తేదీ లోపు ప్రారంభిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







