యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- June 22, 2026
ప్రతిమ మెడికల్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కరీంనగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆదివారం యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వైద్యులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాధాన్యతను తెలుసుకున్నారు.
యోగా గురువులు నాగమల్ల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. వారు తాడాసనం, వజ్రాసనం, ప్రాణాయామం తదితర వివిధ యోగా ఆసనాలను అభ్యసించారు.
ఈ సందర్భంగా యోగా గురువులు మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ ఇజ్రాయెల్, సీఏఓ రామ్చందర్ రావు, డాక్టర్లు ప్రణయ్, శ్రీకాంత్తో పాటు కళాశాల విద్యార్థులు, పీజీ వైద్యులు, మెడికల్ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా క్రమశిక్షణ, సానుకూల ఆలోచన విధానం కూడా పెంపొందుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సంకల్పించారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







