ఎఫ్‌సీఐ ఉద్యోగులకు వృద్ధాప్యంలో కల్పించే ప్రయోజనాలు

- August 10, 2016 , by Maagulf
ఎఫ్‌సీఐ ఉద్యోగులకు వృద్ధాప్యంలో కల్పించే ప్రయోజనాలు

సుమారు 35 వేల మంది భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) ఉద్యోగులకు కొత్త పింఛను పథకానికి, ఉద్యోగ విరమణ అనంతర వైద్య సేవలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఉద్యోగులకు వృద్ధాప్యంలో కల్పించే ప్రయోజనాల్లో భాగంగా ప్రవేశపెట్టిన వీటికి ఏటా రూ.134.4 కోట్లు ఖర్చు కానుందని కేంద్ర ఆహారమంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ తెలిపారు. 2008, డిసెంబరు 1 నుంచి పింఛను పథకం, ఉద్యోగ విరమణ పొందినవారికి 2006, ఏప్రిల్‌ 1 నుంచి వైద్య సేవలు వర్తిస్తాయని వర్తిస్తుందని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.
బొగ్గు విద్యుత్‌ కేంద్రాల కోసం పరిజ్ఞానాభివృద్ధి ప్రాజెక్టుకు సమ్మతి బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రాలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కోసం రూ.1,555 కోట్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ (ఏయూఎస్‌సీ) పరిజ్ఞాన అభివృద్ధికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ఇంధన భద్రతకు తోడ్పడగలదని భావిస్తున్నారు. బొగ్గు వినియోగం, బొగ్గుపులుసు వాయువు ఉద్గారాన్ని తగ్గించే ఏయూఎస్‌సీ పరిజ్ఞాన రూపకల్పన కోసం పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టాలని బీహెచ్‌ఈఎల్‌, ఐజీసీఏఆర్‌, ఎన్‌టీపీసీ ప్రతిపాదించాయి. ఇది భారత పరిశ్రమలు అధిక బొగ్గు వినియోగ సామర్థ్యంతో కూడిన విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పటానికి వీలు కల్పిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com