జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు ..
- August 10, 2016
విపక్ష నేత జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు పరుగుపెట్టేస్తున్నాయి. శారదా స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొన్న జగన్.. ఏపీకి మంచి జరగాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటుంటే.. సోషల్ మీడియా నుంచి మాత్రం.. సైడ్ ఎఫెక్ట్స్ తప్పలేదు. జగన్ తో పాటు ఎమ్.పిలు అవినాశ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి కూడా పాల్గొన్న ఈ పూజల వెనుక వేరే కథ ఉందంటూ సెటైర్లు పడిపోతున్నాయి.
కృష్ణా పుష్కరాల పేరుతో ఇటు చంద్రబాబు హిందువుల మనోభావాలను కొల్లగొడుతుంటే.. జగన్ కు కన్నుకుట్టిందని.. అందుకే రిషీకేశ్ వెళ్లి పూజలు పునస్కారాలంటూ హడావిడి చేసుకున్నారని కొన్ని వెబ్ సైట్స్ లో రాతలు కనిపించాయి. ఇటు.. చంద్రబాబుతో బీజేపీ బంధం తెగిపోయే వాతావరణం కనిపిస్తుండడంతో.. ఈవిధంగా హిందుత్వ వాసనలు గుప్పించి కమలం పార్టీకి దగ్గరవ్వొచ్చని జగన్ భావిస్తున్నట్లు ఇంకోవైపు నుంచి రాజకీయ విశ్లేషణలు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాదు.. అక్రమాస్తుల కేసుల ఉచ్చు నుంచి తనను విడదియ్యమనే దేవుణ్ణి వేడుకున్నారని ఇటు తెలుగు తమ్ముళ్ల విసుర్లు. మొత్తంమీద కొత్త గెటప్ లో కనిపించిన యువనేత ఒకరకంగా సంచలనమే క్రియేట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







