జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు ..

- August 10, 2016 , by Maagulf
జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు ..

విపక్ష నేత జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు పరుగుపెట్టేస్తున్నాయి. శారదా స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొన్న జగన్.. ఏపీకి మంచి జరగాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటుంటే.. సోషల్ మీడియా నుంచి మాత్రం.. సైడ్ ఎఫెక్ట్స్ తప్పలేదు. జగన్ తో పాటు ఎమ్.పిలు అవినాశ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి కూడా పాల్గొన్న ఈ పూజల వెనుక వేరే కథ ఉందంటూ సెటైర్లు పడిపోతున్నాయి.
కృష్ణా పుష్కరాల పేరుతో ఇటు చంద్రబాబు హిందువుల మనోభావాలను కొల్లగొడుతుంటే.. జగన్ కు కన్నుకుట్టిందని.. అందుకే రిషీకేశ్ వెళ్లి పూజలు పునస్కారాలంటూ హడావిడి చేసుకున్నారని కొన్ని వెబ్ సైట్స్ లో రాతలు కనిపించాయి. ఇటు.. చంద్రబాబుతో బీజేపీ బంధం తెగిపోయే వాతావరణం కనిపిస్తుండడంతో.. ఈవిధంగా హిందుత్వ వాసనలు గుప్పించి కమలం పార్టీకి దగ్గరవ్వొచ్చని జగన్ భావిస్తున్నట్లు ఇంకోవైపు నుంచి రాజకీయ విశ్లేషణలు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాదు.. అక్రమాస్తుల కేసుల ఉచ్చు నుంచి తనను విడదియ్యమనే దేవుణ్ణి వేడుకున్నారని ఇటు తెలుగు తమ్ముళ్ల విసుర్లు. మొత్తంమీద కొత్త గెటప్ లో కనిపించిన యువనేత ఒకరకంగా సంచలనమే క్రియేట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com