APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- June 24, 2026
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) చివరి దశ మ్యాచ్లు నేటి నుంచి అమరావతి పరిధిలోని మంగళగిరిలో ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీ వరకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ ముగింపు దశకు వేదిక కానుండటంతో స్టేడియంతో పాటు రాజధాని ప్రాంతంలో క్రికెట్ పండుగ వాతావరణం నెలకొంది.
నేడే తొలి పోరు..మధ్యాహ్నం, సాయంత్రం డబుల్ హెడర్స్
మంగళగిరి స్టేడియంలో ఈరోజు రెండు రసవత్తర పోరులు జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు తలపడనున్నాయి. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు జరగబోయే రెండో మ్యాచ్లో భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. టీ20 ఫార్మాట్లో సాగే ఈ లీగ్ మ్యాచ్లు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించనున్నాయి.
మంగళగిరి వేదికగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్కు టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. ఆయన రాకతో ఈ టోర్నీకి మరింత గ్లామర్, క్రేజ్ తోడయ్యాయి. రామ్ చరణ్ టాస్ వేసి ఈ మ్యాచ్లను అధికారికంగా ప్రారంభించనుండటంతో అటు క్రికెట్ ప్రేమికులతో పాటు ఇటు మెగా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పటిష్టమైన భద్రత, అత్యాధునిక వసతులతో ఏసీఏ స్టేడియం ఈ టోర్నీ కోసం ముస్తాబైంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







