రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!

- June 24, 2026 , by Maagulf
రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!

దోహా: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రాస్ లఫాన్‌లోని ఒక పారిశ్రామిక కేంద్రంలో జరిగిన పేలుడులో పలువురు భారతీయ పౌరులు మరణించడం మరియు గాయపడటం పట్ల అమీర్ భారత ప్రధానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గాయపడిన వారికి ఖతార్ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మరియు వైద్య సేవలను, అలాగే ఈ ఘటనపై స్పందించడంలో సంబంధిత అధికారులు చేసిన కృషిని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అభినందించారు.

అలాగే,  రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు, సహకారం మరియు వాటిని మరింత బలోపేతం చేసి అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు.  ఈ మేరకు అమీర్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com