మన ప్రధానిని కలిసిన 'బాహుబలి'

- July 26, 2015 , by Maagulf
మన ప్రధానిని కలిసిన 'బాహుబలి'

బాహుబలి ఘన విజయం సాధించడంతో ఉరిమే ఉత్సాహంతో ఉన్న సినీ హీరో ప్రభాస్ ఆదివారం తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాలపాటు ప్రధానితో వీరి భేటీ సాగింది. ఈ సదర్భంగా ప్రధాని మోదీ బాహుబలి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలిసింది. మోదీతో భేటీ అనంతరం కృష్ణంరాజు, ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. బాహుబలి సినిమా గురించి విన్నానని ఈ చిత్రం చాలా బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ అన్నట్లు కృష్ణంరాజు తెలిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ మోదీతో 10 నిమిషాలు మాట్లాడామని, ఆయనతో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. బాహుబలి సినిమా చూడాలని తాను ప్రధానిని కోరగా ప్రస్తుతం బిజీగా ఉన్నానని, తప్పకుండా చూస్తానని చెప్పారని ప్రభాస్ తెలిపారు. తన జీవితంలో ఈ రోజు చాలా సంతోకరమైనదని ప్రభాస్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులు బాహుబలిని చూశారని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com