మన ప్రధానిని కలిసిన 'బాహుబలి'
- July 26, 2015
బాహుబలి ఘన విజయం సాధించడంతో ఉరిమే ఉత్సాహంతో ఉన్న సినీ హీరో ప్రభాస్ ఆదివారం తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాలపాటు ప్రధానితో వీరి భేటీ సాగింది. ఈ సదర్భంగా ప్రధాని మోదీ బాహుబలి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలిసింది. మోదీతో భేటీ అనంతరం కృష్ణంరాజు, ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. బాహుబలి సినిమా గురించి విన్నానని ఈ చిత్రం చాలా బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ అన్నట్లు కృష్ణంరాజు తెలిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ మోదీతో 10 నిమిషాలు మాట్లాడామని, ఆయనతో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. బాహుబలి సినిమా చూడాలని తాను ప్రధానిని కోరగా ప్రస్తుతం బిజీగా ఉన్నానని, తప్పకుండా చూస్తానని చెప్పారని ప్రభాస్ తెలిపారు. తన జీవితంలో ఈ రోజు చాలా సంతోకరమైనదని ప్రభాస్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులు బాహుబలిని చూశారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







