కేటీఆర్ కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు
- August 11, 2016
తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్విదేశీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. తొలుత శ్రీలంకలో భారత హై కమిషనర్ వైకే సిన్హతో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల పెంపుపై చర్చించారు. కొలంబో- హైదరాబాద్ విమాన సౌకర్యం పైనా ఆయనతో ప్రస్తావించారు. దీంతో ఆయన తెలంగాణలో శ్రీలంక పెట్టుబడులకు భారత్ కమిషనర్ హామీ ఇచ్చారు. జాన్కీల్స్ కంపెనీ ప్రతినిధులతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులకు వారు సంసిద్ధత వ్యక్తంచేశారు. మలేషియాలోని పేర్ రాష్ట్ర సీఎంతో కొలంబోలో కేటీఆర్ సమావేశమయ్యారు. పలు వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఇరువురిమధ్య చర్చలు జరిగాయి.




తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







