ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- June 29, 2026
టెహ్రాన్: ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ అమెరికన్ డాలర్ల స్తంభింపజేసిన నిధులు త్వరలో విడుదల కానున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సోమవారం ప్రకటించారు. అమెరికాతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఖతార్లో ఉన్న మొత్తం 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తుల్లో తొలి విడతగా 6 బిలియన్ డాలర్లు విడుదల చేసి దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు పెజెష్కియన్ పేర్కొన్నారు.
ఈ అంశంపై ఇప్పటివరకు వ్యాఖ్యానించిన ఇరాన్లోని అత్యున్నత స్థాయి నాయకుడు పెజెష్కియన్ కావడం విశేషం. అయితే, అమెరికా అధికారులు మాత్రం ఇరాన్కు చెందిన ఎలాంటి స్తంభింపజేసిన నిధులు ఇప్పటివరకు విడుదల కాలేదని స్పష్టం చేశారు.
ఖతార్ అమెరికా–ఇరాన్ మధ్య చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా, అరేబియా గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఇక పెజెష్కియన్ చేసిన ఈ ప్రకటన ద్వారా అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందం పై ఇరాన్ ప్రజల్లో విశ్వాసం పెంచే ప్రయత్నం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







