కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- June 29, 2026
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) తన రికార్డుల నుండి 464 మంది ప్రవాసుల నమోదిత నివాస చిరునామాలను రద్దు చేసింది. చట్టపరమైన జరిమానాలను నివారించడానికి, ప్రభావితమైన వారు 30 రోజులలోపు తమ చిరునామా సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని కోరింది.
ఈ మేరకు 'కువైట్ అల్-యౌమ్' అనే అధికారిక గెజెట్లో ప్రచురించారు. ఆస్తి యజమానులు సమర్పించిన ప్రకటనల ఆధారంగా లేదా నమోదిత చిరునామాలకు సంబంధించిన భవనాలను కూల్చివేయడం వల్ల ఈ చిరునామాలను రద్దు చసినట్లు పీఏసీఐ తెలిపింది.
ప్రభావిత వ్యక్తులు అవసరమైన విధానాలను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత, తమ కొత్త నివాస చిరునామాలను నమోదు చేసుకోవడానికి లేదా 'సాహెల్' అప్లికేషన్ ద్వారా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని పీఏసీఐ సేవా కేంద్రాలను సందర్శించాలని ఆ సంస్థ సూచించింది. ఈ ఉత్తర్వులు ప్రచురించబడిన తేదీ నుండి 30 రోజులలోపు అన్ని చిరునామా అప్డేట్ లను తప్పనిసరిగా పూర్తి చేయాలని పీఏసీఐ స్పష్టం చేసింది.
నిర్దిష్ట కాలపరిమితిలోగా నివాస సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడంలో విఫలమైతే, 1982 నాటి చట్టం నెం. 32లోని ఆర్టికల్ 33 ప్రకారం జరిమానాలు విధించబడతాయని, ఇందులో KD 100 వరకు జరిమానాలు ఉంటాయని, మరియు ప్రమేయం ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి ఈ జరిమానాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పీఏసీఐ హెచ్చరించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







