కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- June 29, 2026
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) తన రికార్డుల నుండి 464 మంది ప్రవాసుల నమోదిత నివాస చిరునామాలను రద్దు చేసింది. చట్టపరమైన జరిమానాలను నివారించడానికి, ప్రభావితమైన వారు 30 రోజులలోపు తమ చిరునామా సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని కోరింది.
ఈ మేరకు 'కువైట్ అల్-యౌమ్' అనే అధికారిక గెజెట్లో ప్రచురించారు. ఆస్తి యజమానులు సమర్పించిన ప్రకటనల ఆధారంగా లేదా నమోదిత చిరునామాలకు సంబంధించిన భవనాలను కూల్చివేయడం వల్ల ఈ చిరునామాలను రద్దు చసినట్లు పీఏసీఐ తెలిపింది.
ప్రభావిత వ్యక్తులు అవసరమైన విధానాలను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత, తమ కొత్త నివాస చిరునామాలను నమోదు చేసుకోవడానికి లేదా 'సాహెల్' అప్లికేషన్ ద్వారా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని పీఏసీఐ సేవా కేంద్రాలను సందర్శించాలని ఆ సంస్థ సూచించింది. ఈ ఉత్తర్వులు ప్రచురించబడిన తేదీ నుండి 30 రోజులలోపు అన్ని చిరునామా అప్డేట్ లను తప్పనిసరిగా పూర్తి చేయాలని పీఏసీఐ స్పష్టం చేసింది.
నిర్దిష్ట కాలపరిమితిలోగా నివాస సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడంలో విఫలమైతే, 1982 నాటి చట్టం నెం. 32లోని ఆర్టికల్ 33 ప్రకారం జరిమానాలు విధించబడతాయని, ఇందులో KD 100 వరకు జరిమానాలు ఉంటాయని, మరియు ప్రమేయం ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి ఈ జరిమానాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పీఏసీఐ హెచ్చరించింది.
తాజా వార్తలు
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!







