సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- June 29, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ లో ఉన్న రాస్ తనురా వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతోపాటు అరబ్ మరియు గల్ఫ్ దేశాలు సంతాపం తెలియజేఃస్తున్నాయి.
ఈ విషాద సంఘటన నేపథ్యంలో సౌదీ అరేబియాకు జోర్డాన్ రాజు అబ్దుల్లా పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. జోర్డాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అంబాసిడర్ ఫౌద్ మజాలీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కూడా ఈ ప్రమాదంపై రాజు సల్మాన్కు తన సంతాపం తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఓదార్పు కలగాలని ప్రార్థించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా సంతాప సందేశాన్ని పంపించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్ లు తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలోయూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మృతుల కుటుంబాలకు, ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
ఈ విషాద ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియాకు గల్ఫ్ సహకార మండలి (GCC) సంఘీభావం తెలుపుతుందని సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్-బుదైవి తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







