సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- June 29, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ లో ఉన్న రాస్ తనురా వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతోపాటు అరబ్ మరియు గల్ఫ్ దేశాలు సంతాపం తెలియజేఃస్తున్నాయి.
ఈ విషాద సంఘటన నేపథ్యంలో సౌదీ అరేబియాకు జోర్డాన్ రాజు అబ్దుల్లా పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. జోర్డాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అంబాసిడర్ ఫౌద్ మజాలీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కూడా ఈ ప్రమాదంపై రాజు సల్మాన్కు తన సంతాపం తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఓదార్పు కలగాలని ప్రార్థించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా సంతాప సందేశాన్ని పంపించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్ లు తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలోయూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మృతుల కుటుంబాలకు, ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
ఈ విషాద ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియాకు గల్ఫ్ సహకార మండలి (GCC) సంఘీభావం తెలుపుతుందని సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్-బుదైవి తెలిపారు.
తాజా వార్తలు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం







