కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- July 02, 2026
కువైట్ సిటీ: లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఏ.యూసఫ్ అలీ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ను బయాన్ ప్యాలెస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 30న జరిగిన ఈ సమావేశంలో లులు గ్రూప్ ప్రతినిధి బృందం కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా సంక్షోభ సమయాల్లో కువైట్లో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి లులు గ్రూప్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను అమీర్కు యూసఫ్ అలీ వివరించారు. దేశంలో అవసరమైన ఆహార సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు సంస్థ తీసుకున్న చర్యలను వివరించినట్లు తెలిపారు.
లులు గ్రూప్ కువైట్ ఆహార భద్రతకు అందిస్తున్న సేవలు, నిబద్ధతను అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ అభినందించినట్లు వెల్లడించారు. దేశ ప్రజలకు అవసరమైన ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో లులు గ్రూప్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ సమావేశానికి అవకాశం కల్పించిన కువైట్ అమీర్కు యూసఫ్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. కువైట్ అభివృద్ధి, ఆహార భద్రత రంగాల్లో ప్రభుత్వంతో కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.


తాజా వార్తలు
- భారత కాన్సుల్ జనరల్కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం
- సౌదీ తబూక్లో భారతీయులతో కాన్సుల్ జనరల్ భేటీ..
- రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త.. జీబ్రా క్రాసింగ్లనే ఉపయోగించాలి: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- థాయ్లాండ్లో వెలుగుచూసిన ‘రాక్షస కన్ను’.. పోటెత్తిన పర్యాటకులు
- బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా..నలుగురి అరెస్ట్..!!
- కారిడార్లలో ఫర్నిచర్ నిల్వ చేయొద్దు.. షార్జా సివిల్ డిఫెన్స్ హెచ్చరిక
- షావుకారు జానకి కన్నుమూత..చిరంజీవి తీవ్ర సంతాపం
- పిల్లల సోషల్ మీడియాపై ఆంక్షలు.. యూఏఈ స్కూళ్లో మారనున్న పరిస్థితులు..!!
- సౌదీలో స్కూల్ రవాణా సేవలపై విద్యాశాఖ కీలక మార్గదర్శకాలు..!!
- కటారా ఆహ్వానం.. వీకెండ్ లో కల్చర్, వినోదంతో సందడి..!!







