కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- July 02, 2026
కువైట్ సిటీ: లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఏ.యూసఫ్ అలీ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ను బయాన్ ప్యాలెస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 30న జరిగిన ఈ సమావేశంలో లులు గ్రూప్ ప్రతినిధి బృందం కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా సంక్షోభ సమయాల్లో కువైట్లో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి లులు గ్రూప్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను అమీర్కు యూసఫ్ అలీ వివరించారు. దేశంలో అవసరమైన ఆహార సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు సంస్థ తీసుకున్న చర్యలను వివరించినట్లు తెలిపారు.
లులు గ్రూప్ కువైట్ ఆహార భద్రతకు అందిస్తున్న సేవలు, నిబద్ధతను అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ అభినందించినట్లు వెల్లడించారు. దేశ ప్రజలకు అవసరమైన ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో లులు గ్రూప్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ సమావేశానికి అవకాశం కల్పించిన కువైట్ అమీర్కు యూసఫ్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. కువైట్ అభివృద్ధి, ఆహార భద్రత రంగాల్లో ప్రభుత్వంతో కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.


తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







