'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- July 03, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధునికీకరణలో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ శుక్రవారం పలు కీలక మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన 'ది లయన్స్ – బెల్ ఆఫ్ ఆర్మ్స్' ఆర్మరీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ ఆర్మరీ ద్వారా ఆయుధాల భద్రపరిచే వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుందని అధికారులు తెలిపారు.
అనంతరం పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్కు చెందిన 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను డీజీపీ ప్రారంభించారు. పోలీసు శాఖకు చెందిన వాహనాల నిర్వహణ, మరమ్మతులు, సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అదే కార్యక్రమంలో 'సారథి' మొబైల్ యాప్ను కూడా డీజీపీ ప్రారంభించారు. పోలీసు రవాణా విభాగంలో సేవలను డిజిటలైజ్ చేయడం, వాహనాల నిర్వహణను సులభతరం చేయడం, పనితీరులో పారదర్శకత పెంపొందించడం లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







