భారత్ ఇ-మైగ్రేట్ సిస్టం కు శ్రామికులనుండి అనూహ్య స్పందన!
- July 26, 2015
మోసపూరిత ఉద్యోగావకాశాల వల నుండి ముఖ్యంగా అల్ప ఆదాయ వర్గాలవారిని, కార్మికులను కాపాడడానికి భారత ప్రభుత్వం వారిచే జూన్ 1 నుండి ప్రవేశపెట్టబడిన ఇ-మైగ్రేట్ సిస్టం కు మంచి స్పందన లభిస్తోంది. శ్రామికులకు ఉద్యోగం అవకాశం గుర్తింపుపొందినది కానట్లైతే, వారు ఏమిగ్రేషన్ చెక్ రెక్వేర్డ్ (ECR) వద్ద సమర్పించిన పాస్ పోర్టు తిరస్కరించబడుతుంది. అబుధాబీ లోని భారత రాయబార కార్యాలయం రెండవ సెక్రెటరీ శ్రీ మొహమ్మద్ షహీద్ అలం ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యొగార్ధులు విదేశాలకు వెళ్లబోయేముందు భారత్ లోని ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, చండీఘడ్, కోచి, తిరువనంతపురం మరియు జైపూర్ లలో ఉన్న "ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్" వారి కార్యాలయాలకు వెళ్లినాట్లైతే, ఆ అవకాశాలు, వేతనాలను పరీక్షించి చెపుతారని, ఒకవేళ గుర్తింపులేని సంస్థలైతే, శ్రామికులు విదేశాలకు వెళ్ళడానికి అనుమతించరని ఆయన వివరించారు. ఈ ఇ-మైగ్రేట్ సిస్టం లో రిజిస్టర్ చేసుకున్నవారి సంఖ్య 18 నుండి ఒక్కసారిగా 195 కు పెరిగిందని కూడా వారు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







