యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం

- July 12, 2026 , by Maagulf
యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం

అబూదాబి: యూఏఈ సరిహద్దుల వెలుపల ఈ ఉదయం కొన్ని క్షిపణుల కదలికలు గుర్తించినప్పటికీ, దేశంలో ఎలాంటి ప్రమాద పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అధికారిక ప్రకటనలో, గుర్తించిన క్షిపణి ముప్పు యూఏఈ భూభాగం వెలుపలే ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు, ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, స్థిరంగా ఉందని తెలిపారు.

ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, భద్రతా సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రాంతీయ పరిణామాల పై సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని యూఏఈ అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com