జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- August 26, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘సంజీవని ప్రాజెక్టు’ను వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ పథకం పురోగతిపై చర్చించారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సమగ్రంగా రూపొందించి ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేస్తే ఆరోగ్య సంరక్షణ రంగంలో అనూహ్యమైన, సానుకూల ఫలితాలు సాధించవచ్చని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా నిర్వహిస్తున్న సంజీవని కార్యక్రమం ద్వారా ఆశించిన రీతిలో మంచి ఫలితాలు వస్తున్నాయని, దాని అనుభవాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రమంతటా విస్తరించాలని స్పష్టం చేశారు.
డిజిటల్ హెల్త్ రికార్డులు & ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం వైద్యం అందించడమే కాకుండా రోగుల ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు తీసుకువచ్చేలా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వ్యాధులు రాకుండా చూసే నివారణ చర్యలపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్యం (శానిటేషన్) ప్రమాణాలను మరింత పెంచడంతో పాటు, ఔట్ సోర్సింగ్ సేవల నాణ్యతను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలందరికీ నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే సంజీవని ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







