లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- July 13, 2026
దోహ: లూసైల్ స్టేడియం రోడ్డులో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 12 నుండి జులై 19 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో మాత్రమే ఈ మూసివేత ఉంటుందని పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షల పూర్తి వివరాలు:
ఆదివారం నుండి గురువారం: అర్ధరాత్రి 12:00 గంటల నుండి తెల్లవారుజామున 5:00 గంటల వరకు రోడ్డు మూసివేయబడుతుంది.
శుక్రవారం: తెల్లవారుజామున 2:00 గంటల నుండి ఉదయం 10:00 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి.
శనివారం: తెల్లవారుజామున 2:00 గంటల నుండి ఉదయం 7:00 గంటల వరకు రోడ్డును మూసివేస్తారు.
ఈ సమయాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను గమనిస్తూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







