కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- July 13, 2026
కువైట్ సిటీ: ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను పాటించాల్సిందిగా కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఆదేశాలు జారీ చేశారు .
ఈ అధికారిక సంతాప దినాలు జులై 12 నుండి ప్రారంభమయ్యాయి. సంతాప సూచికగా కువైట్ దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోని కువైట్ రాయబార కార్యాలయాలు (ఎంబసీలు), దౌత్య కార్యాలయాలపై జాతీయ జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు.
షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల కువైట్ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తన దేశానికి ఆయన చేసిన విశేష సేవలకు తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షిస్తూ, ఖతార్ రాజకుటుంబానికి మరియు ప్రజలకు తమ సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







