కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- July 13, 2026
కువైట్ సిటీ: ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను పాటించాల్సిందిగా కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఆదేశాలు జారీ చేశారు .
ఈ అధికారిక సంతాప దినాలు జులై 12 నుండి ప్రారంభమయ్యాయి. సంతాప సూచికగా కువైట్ దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోని కువైట్ రాయబార కార్యాలయాలు (ఎంబసీలు), దౌత్య కార్యాలయాలపై జాతీయ జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు.
షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల కువైట్ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తన దేశానికి ఆయన చేసిన విశేష సేవలకు తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షిస్తూ, ఖతార్ రాజకుటుంబానికి మరియు ప్రజలకు తమ సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







