కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!

- July 13, 2026 , by Maagulf
కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!

కువైట్ సిటీ: ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను పాటించాల్సిందిగా కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఆదేశాలు జారీ చేశారు .

ఈ అధికారిక సంతాప దినాలు జులై 12 నుండి ప్రారంభమయ్యాయి. సంతాప సూచికగా కువైట్ దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోని కువైట్ రాయబార కార్యాలయాలు (ఎంబసీలు), దౌత్య కార్యాలయాలపై జాతీయ జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు.


షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల కువైట్ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తన దేశానికి ఆయన చేసిన విశేష సేవలకు తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షిస్తూ, ఖతార్ రాజకుటుంబానికి మరియు ప్రజలకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com