స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న ఎర్రకోట.!
- August 13, 2016
ఆగస్టు 15న జరిగే 70వ స్వాతంత్య్రదినోత్సవానికి దేశరాజధాని దిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. వేడుకల్లో పాల్గొనే పలు పాఠశాలల చిన్నారులు రిహార్సల్స్ ప్రారంభించారు. మరోవైపు త్రివిధ దళాల సిబ్బంది కూడా విన్యాసాలు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ల ద్వారా భద్రతా చర్యలు చేపట్టనున్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
దిల్లీలో భద్రత కట్టుదిట్టం మరోవైపు స్వాతంత్య్రదినోత్సవం నేపథ్యంలో దేశరాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15న పోలీసుల సెలవులను రద్దు చేస్తున్నామని.. అందరూ హాజరుకావాలని పోలీస్ కమిషనర్ అలోక్ వర్మ చెప్పారు. ప్రతి పీసీఆర్ వ్యాన్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వర్మ సూచించారు. పర్యాటక ప్రదేశాలు, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







