నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు - కమల్
- August 13, 2016
విలక్షణ కథానాయకుడు కమల్హాసన్ ఇటీవల జరిగిన ప్రమాదానంతరం తిరిగి కోలుకున్నారు. ఆల్వార్పేటలోని తన కార్యాలయం మెట్లు ఎక్కుతూ జారిపడటంతో ఈమధ్యనే ఆయన కుడి కాలికి సర్జరీ జరిగింది. గత వారంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. రెండ్రోజులుగా ఆయన జిమ్కు వెళ్తున్నారు. ఇదే విషయాన్ని తన అభిమానులతో ఆయన ట్విటర్లో పంచుకున్నారు. 'కుట్లు విప్పారు. గత రెండు రోజులుగా జిమ్కు వెళ్తున్నా. పూర్తి స్థాయిలో ఫిజియో జరుగుతోంది. నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు' అని ఆ ట్వీట్లో కమల్ పేర్కొన్నారు. అంతకుముందు, వాట్సాప్ ఆడియోలో తమిళంలో ఆయన మాట్లాడుతూ, తన పట్ల ఇంతగా ప్రేమాభిమానులు చూపిస్తున్న అభిమానులు, మిత్రులు, కుటుంబసభ్యులు, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలని అన్నారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ఈ సమయంలో ప్రమాదం జరగడం దురదృష్టమేనని ఆయన వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కమల్ 'శభాష్ నాయుడు' చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







