ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- July 18, 2026
కువైట్ సిటీ: ఇరాన్ దాడి నేపథ్యంలో కువైట్లోని విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ (ఉప్పునీటి శుద్ధి) కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు కువైట్ విద్యుత్, జలవనరులు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
కువైట్ న్యూస్ ఏజెన్సీ (కునా) కథనం ప్రకారం, శత్రుదాడి కారణంగా విద్యుత్ ఉత్పత్తి, నీటి డీసాలినేషన్ కేంద్రంలోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో కార్మికుల భద్రత, విద్యుత్ సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్లోని పలు యూనిట్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్నిమాపక బృందాలు, కువైట్ ఫైర్ ఫోర్స్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
దాడి జరిగిన వెంటనే అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను అమల్లోకి తీసుకువచ్చామని, విద్యుత్, నీటి సేవలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రజలు విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉండే గరిష్ట వినియోగ సమయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







