జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- July 18, 2026
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. తొలిసారి జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్కు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డులకు ఎక్కింది. తెలుగు తేజం సింధు సెమీస్లో చైనాకు చెందిన చెన్ యుఫీయుని 21-19, 15-10 తేడాతో ఓడించింది. ఈ క్రమంలో చైనా ప్రత్యర్థిపై ఐదు గేమ్ల ఓటమి పరంపరకు ముగింపు పలికింది.
రెండో సెట్లో సింధు ఆధిక్యంలో ఉన్న సమయంలో తొడ కండరాల గాయం కారణంగా యుఫీయ్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో సింధు ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా.. గత రెండళ్ల కాలంలో ఓ టోర్నీలో సింధు ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరో సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానీపై జపాన్కు చెందిన అకానె యమగూచి విజయం సాధించింది. తొలి సెట్లో ఓడిపోయినప్పటికి ఆ తరువాత వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని 9-21, 21-16, 21-14 తేడాతో యమగూచి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







