అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ...

- August 13, 2016 , by Maagulf
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ...

నవీన్‌ చంద్ర, శ్రుతి సోథి జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి రెండో షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ,''అధినేత', 'ఏమైంది ఈ వేళ', 'బెంగాల్‌ టైగర్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రమిది. హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. శుక్రవారంతో ముగిసిన ఫస్ట్‌ షెడ్యూల్‌తో 60శాతం సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ నెల 16 నుంచి నాన్‌స్టాప్‌గా జరిగే రెండో షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. దర్శకుడు సత్తిబాబు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందించే చిత్రమవుతుంది' అని అన్నారు. పృథ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి.పి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com