కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- July 20, 2026
కువైట్ సిటీ: ఇటీవల కువైట్ ఎయిర్వేస్ విమానాలు రద్దయ్యాయన్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఏ విమానాన్నీ రద్దు చేయలేదని, తాత్కాలిక అంతరాయాల కారణంగా కొన్ని సర్వీసుల సమయాలను మాత్రమే మార్చామని కువైట్ ఎయిర్వేస్ యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్వహాబ్ ఇబ్రహీం అల్-షట్టి తెలిపారు. కువైట్ ఎయిర్వేస్ అన్ని డైరెక్ట్ విమానాలను ఆమోదించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తోందన్నారు. శనివారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్, ల్యాండింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని విమానాల సమయాలను మాత్రమే మార్చాల్సి వచ్చిందని వివరించారు.
కువైట్ ఎయిర్వేస్ ఆపరేషన్స్, సాంకేతిక, పరిపాలనా బృందాలు ప్రభావిత విమానాలను వీలైనంత త్వరగా తిరిగి షెడ్యూల్ చేసి నిర్వహించాయని తెలిపారు. ఈ మార్పులు ఆదివారం విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అన్ని విమానాలు యథావిధిగా నడిచాయని చెప్పారు. ప్రాంతీయ పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ సేవలకు అంతరాయం కలగకుండా అనువైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నామని అల్-షట్టి పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సంస్థకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, విమానాలను రద్దు చేయకుండా కేవలం రీషెడ్యూల్ చేయడం ద్వారా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు.
ప్రయాణికులు తాజా సమాచారం కోసం కువైట్ ఎయిర్వేస్ అధికారిక సమాచార మార్గాలనే ఫాలో కావాలని, టికెట్ బుకింగ్ సమయంలో తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలను సరిగా నమోదు చేయాలని సూచించారు. దీంతో విమాన షెడ్యూల్లో మార్పులు జరిగితే వెంటనే సమాచారం అందుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







