ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- September 05, 2026
దోహా: శిక్షణ, సంస్థాగత అభివృద్ధి, పరిశోధన, నిపుణుల అనుభవాల మార్పిడి వంటి అంశాల్లో పరస్పర సహకారం పెంపొందించేందుకు ఖతార్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరఫున క్రిమినల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, చీఫ్ ప్రాసిక్యూటర్ టుర్కీ రషీద్ అల్ మొహన్నది, స్టేట్ ఆడిట్ బ్యూరో తరఫున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ మహమ్మద్ మొహ్ధర్ అల్ సాదీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఇరు సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరయ్యారు. ఈ ఒప్పందం ఇరు సంస్థల మధ్య ఉన్న సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని పేర్కొన్నారు.
ఒప్పందంలో భాగంగా ఇరు పక్షాలు సంయుక్తంగా శిక్షణా కోర్సులు, సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించనున్నాయి. అలాగే వృత్తిపరమైన నైపుణ్యాలు, అనుభవాలను పరస్పరం పంచుకోవడంతో పాటు సంయుక్త శిక్షణా కార్యక్రమాలను అమలు చేయనున్నాయి. అదేవిధంగా ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాల్లో సంయుక్త అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టడం, పరిశోధకులు మరియు పరిశోధనా బృందాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కూడా ఒప్పందంలో భాగంగా ఉంది. ఇరు సంస్థల వద్ద అందుబాటులో ఉన్న నైపుణ్యాలు, వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా సంస్థాగత అభివృద్ధికి తోడ్పడటం, జాతీయ స్థాయి సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన







