బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- July 20, 2026
మనామా: ఇరాన్ జరిపిన దాడుల సందర్భంగా శత్రు డ్రోన్లు బహ్రెయిన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR)కు సేవలందించే పౌర వైమానిక నావిగేషన్ పరికరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అఫైర్స్ (CAA) వెల్లడించింది.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ప్రచురించిన ప్రకటనలో, దాడి జరిగిన వెంటనే సంబంధిత అధికారులు ఆమోదిత భద్రతా, కార్యాచరణ విధానాల ప్రకారం అత్యవసర చర్యలు చేపట్టారని తెలిపింది. వైమానిక నావిగేషన్ సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.
బహ్రెయిన్ గగనతల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు పరిస్థితిని సమర్థంగా నిర్వహించారని, విమానాల రాకపోకలు సురక్షితంగా కొనసాగుతున్నాయని సీఏఏ స్పష్టం చేసింది.
బహ్రెయిన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ గుండా ప్రయాణించే అంతర్జాతీయ విమానాలతో పాటు అన్ని విమాన సర్వీసులు సాధారణంగానే కొనసాగుతున్నాయని తెలిపింది. అంతర్జాతీయ సంస్థలు, సంబంధిత అధికార యంత్రాంగంతో సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అఫైర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







