భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- July 21, 2026
న్యూఢిల్లీ: భారత్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొత్త రాయబారిగా నియమితులైన అబ్దుల్లా అల్ నుఐమీ తన క్రెడెన్షియల్స్ డాక్యుమెంట్స్ ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖ తాత్కాలిక చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్కు సమర్పించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అల్ నుఐమీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
అనంతరం అబ్దుల్లా అల్ నుఐమీ మాట్లాడుతూ.. భారత్లో యూఏఈకి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అంతకుముందు, భారత్–యూఏఈ మధ్య సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రెండు దేశాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







