డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- July 21, 2026
మనామా: డొమెస్టిక్ వర్కర్ ని బలవంతంగా పని చేయించి, ఆమె వేతనాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఓ ఆసియా మహిళకు విధించిన మూడేళ్ల జైలు శిక్షతో పాటు BD2,000 జరిమానాను** బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కసేషన్ (Court of Cassation) ఖరారు చేసింది. అదేవిధంగా, బాధిత మహిళను ఆమె స్వదేశానికి పంపించే ఖర్చును కూడా నిందితురాలే భరించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు పత్రాల ప్రకారం, 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 20 ఏళ్ల డొమెస్టిక్ వర్కర్ ను మొత్తం తొమ్మిది వేర్వేరు కుటుంబాల వద్ద పని చేయించారు. మొదటి రెండు నెలలు మినహా మిగతా కాలంలో ఆమెకు ఎలాంటి వేతనం చెల్లించలేదు. అంతేకాకుండా, ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని, ఆమెకు రావాల్సిన వేతనాలను కూడా నిందితురాలు అక్రమంగా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసుపై బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) మరియు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. విచారణలో మానవ అక్రమ రవాణా (Human Trafficking) మరియు అనుమతి లేకుండా కార్మికుల నియామకం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కసేషన్ సమర్థిస్తూ, నిందితురాలి శిక్షను యథాతథంగా కొనసాగించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







