గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- July 24, 2026
అబుదాబి: ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సౌకర్యార్థం అబుదాబిలో రెండు కొత్త బస్ సర్వీసులను ప్రారంభించారు. MR1 మరియు MR2 పేర్లతో ప్రారంభించిన ఈ బస్ లైన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ రైల్వే స్టేషన్ ను మెయిన్ బస్ స్టేషన్ మరియు అల్ జహ్యా బస్ స్టేషన్ తో ఇరువైపులా అనుసంధానిస్తాయి. ఈ కొత్త బస్ సర్వీసుల ద్వారా ప్రయాణికులు ఎతిహాద్ రైల్ సేవలను మరింత సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఎతిహాద్ రైల్ జూన్ 30న ప్రయాణికుల సేవల తొలి దశను ప్రారంభించింది. ఈ దశలో అబుదాబి–ఫుజైరా మధ్య రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైల్వే నెట్వర్క్ను సెప్టెంబర్ 30న అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు ఆరు రైలు సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో మూడు సర్వీసులు అబుదాబి నుంచి ఫుజైరాకు, మరో మూడు ఫుజైరా నుంచి అబుదాబికి రన్ అవుతున్నాయి. ఈ రైళ్ల రాకపోకలకు అనుగుణంగా బస్, టాక్సీ సేవలను సమన్వయం చేస్తున్నట్లు ఎతిహాద్ రైల్ వెల్లడించింది. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నది.
ఇక ప్రయాణికులకు 10 దిర్హామ్లతో షటిల్ బస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఈ షటిల్ బస్ మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ స్టేషన్ నుంచి ADNOC ప్రధాన కార్యాలయం (కోర్నిష్ రోడ్ వెస్ట్), ADNEC సెంటర్, రీమ్ మాల్ వంటి ప్రధాన ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ సేవను ఎతిహాద్ రైల్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
ఇక ఫుజైరా స్టేషన్లో కారు అద్దె సేవలు, టాక్సీ స్టాండ్లు, రైడ్-హైలింగ్ పిక్అప్ పాయింట్లు, బస్ కనెక్షన్లు కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో మరిన్ని కారు అద్దె సంస్థలను కూడా ఎతిహాద్ రైల్ నెట్వర్క్లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







