మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి

- September 15, 2026 , by Maagulf
మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం: మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో కలిసి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం, సమృద్ధి కోసం గవర్నర్‌తో కలిసి ప్రార్థనలు చేశారు.

మంగినపూడి సాగర తీరంలో నిర్వహిస్తున్న మహాగణపతి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గణనాథుడి దర్శనం, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాగర తీరం భక్తి వాతావరణాన్ని సంతరించుకుంది.

గవర్నర్‌తో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం పట్ల ఎంపీ బాలశౌరి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com