కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- July 26, 2026
కువైట్ సిటీ: కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో ఆహార భద్రత తనిఖీల సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 61.23 కిలోల చేపలను పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. తనిఖీలలో భాగంగా వినియోగానికి పనికిరాని ఆహార పదార్థాలను విక్రయించడం, కల్తీ ఆహార ఉత్పత్తులను పంపిణీ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన పలు ఆహార సంస్థలపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.
ఆహార భద్రతా నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం, ఆహార వ్యాపార సంస్థలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం







