స్వాతంత్య్రదిన వేడులకు ముస్తాబైన ఢిల్లీ

- August 14, 2016 , by Maagulf
స్వాతంత్య్రదిన వేడులకు ముస్తాబైన ఢిల్లీ

70వ స్వాతంత్య్ర దిన వేడుకలకు దేశ రాజధాని దిల్లీ నగరం సిద్ధమైంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దిల్లీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. నిఘా నేత్రాలను మరింత పటిష్ట పరిచేందుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూపించగలిగే హై రిజల్యూషన్‌ కెమెరాలను రూ.2కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రదిన వేడుకల ప్రాంగణం వద్ద ఐదువేల మంది దిల్లీ పోలీసులు సహా కేంద్ర భద్రతా దళాలు, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ దళాలు పహారా కాస్తున్నారు. ఎర్రకోటలోని చిన్న గదులు, కిటికీలు వంటివి దాదాపు 1800 ప్రదేశాలను భద్రతా దళాలు మూసేశాయి. ప్రధాని ఎర్రకోటకు వచ్చే మార్గంలో 50పీసీఆర్‌ వాహనాలు గస్తీ కాస్తున్నాయి. సందర్శకుల కోసం ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com