మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరుకు బయలుదేరిన రామ్ చరణ్..
- July 26, 2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు.'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో రామ్ చరణ్కు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజే మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్కు తోడుగా ఉండనున్నారు.
ఈ సర్జరీను ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేయనుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, అనంతరం రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన కోసం ప్రార్థిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!
- బ్రిక్స్ పై గ్లోబల్ సౌత్కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ







