ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- July 27, 2026
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం గా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో ‘తీవ్ర వాయుగుండం గా రూపాంతరం చెంది ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, మరియు పోలవరం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
AP & TG Weather: గంటకు 65 కి.మీ వేగంతో గాలులు – మత్స్యకారులకు హెచ్చరికలు
తీరం వెంట గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున బుధవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశించారు.వరద ప్రభావిత, లోతట్టు ప్రాంత ప్రజలు మరియు రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







