పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- July 27, 2026
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (PM Internship Scheme–PMIS) అమలు, ఆంధ్రప్రదేశ్లో జిల్లా వారీ పురోగతి, పథకంలో చేసిన మార్పులు, విద్యార్థులకు అందుతున్న ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలను వెల్లడించింది. మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ సమాచారాన్ని అందించింది.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, పీఎం ఇంటర్న్షిప్ పథకం మూడో విడత ప్రస్తుతం కొనసాగుతోంది. సవరించిన మార్గదర్శకాలతో ఈ విడతను 2026 మార్చి 20న ప్రారంభించారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం పీజీ విద్యార్థులకు కూడా ఈ పథకంలో పాల్గొనే అవకాశం కల్పించారు. అయితే ఎంబీఏ లేదా సమాన అర్హత కలిగిన వారు ఈ పథకానికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే అర్హత కలిగిన కంపెనీల పరిధిని కూడా విస్తరించినట్లు తెలిపింది.
యువతకు మరింత ప్రయోజనం చేకూరేలా ఇంటర్న్షిప్ వ్యవధిని 6 లేదా 9 నెలలుగా సౌలభ్యంతో అమలు చేయడంతో పాటు, నెలవారీ భృతిని రూ.5,000 నుంచి రూ.9,000కు పెంచారు. అదేవిధంగా వయోపరిమితిని 18 నుంచి 25 సంవత్సరాలకు విస్తరించి, చివరి సంవత్సరం డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా అర్హులుగా చేర్చారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పురోగతిపై కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం..
తొలి విడత: 203 ఆఫర్లకు గాను 60 మంది అంగీకరించగా, 8 మంది ఇంటర్న్లుగా చేరారు.
రెండో విడత: 472 ఆఫర్లకు గాను 105 మంది అంగీకరించగా, 17 మంది చేరారు.
మూడో విడత (2026 జూలై 15 నాటికి): 53 ఆఫర్లకు గాను 31 మంది అంగీకరించగా, 22 మంది ఇంటర్న్లుగా చేరారు.
ఈ పథకంలో డ్రాప్అవుట్లను తగ్గించి, పాల్గొనే వారి సంఖ్యను పెంచేందుకు జియో-ట్యాగింగ్, రోలింగ్ ఇంటర్న్షిప్ విధానం, అవగాహన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమల సంఘాలతో సమన్వయం వంటి చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ యువత అధిక సంఖ్యలో ఈ అవకాశాలను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







