ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- July 27, 2026
దుబాయ్: ఎమిరేట్స్ స్కైవార్డ్స్ తన సభ్యులకు యూరప్లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ప్రారంభించిన ‘స్కైవార్డ్స్ రైల్’ సేవ ద్వారా సభ్యులు తమ స్కైవార్డ్స్ మైల్స్ను ఉపయోగించి యూరప్లోని 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఈ సేవ ద్వారా 12 యూరోపియన్ దేశాల్లోని 40కుపైగా ప్రముఖ రైల్వే ఆపరేటర్ల నెట్వర్క్కు సభ్యులు అనుసంధానమవుతారు. వివిధ రైలు సమయాలు, క్యాబిన్లు, టికెట్ రకాలను ఎంపిక చేసుకుని, పూర్తిగా మైల్స్తో లేదా క్యాష్ + మైల్స్ కలయికలో చెల్లించి టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
ఎమిరేట్స్ స్కైవార్డ్స్ డివిజనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నజీబ్ బెన్ ఖెదర్ మాట్లాడుతూ, సభ్యులు తమ స్కైవార్డ్స్ మైల్స్ను విమాన ప్రయాణాలకే కాకుండా మరింత విస్తృతంగా వినియోగించుకునే అవకాశాలను కోరుతున్నారని తెలిపారు. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని స్కైవార్డ్స్ రైల్ సేవను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఈ కొత్త సేవతో యూరప్లో విమాన ప్రయాణంతో పాటు రైలు ప్రయాణాన్ని కూడా ఒకే లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా సులభంగా ప్లాన్ చేసుకునే వీలుకలగనుంది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







