ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- July 28, 2026
దోహా: ఖతార్ జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ అధికారులు సముద్ర మార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా పొగాకు ఉత్పత్తులను తరలించే యత్నాన్ని అడ్డుకున్నారు. దోహా పోర్టు మరియు నార్తర్న్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఓ నౌకలో రహస్యంగా దాచిన 1,650 కిలోల నమిలే పొగాకుతో పాటు 22,005 సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం, సుంకాలను ఎగవేయడంతో పాటు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నౌకలో ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరల్లో ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను దాచినట్లు గుర్తించారు.ఈ ఘటన ఖతార్ కస్టమ్స్ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ రవాణా యత్నమని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకుపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి







