ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- July 28, 2026
దోహా: ఖతార్ జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ అధికారులు సముద్ర మార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా పొగాకు ఉత్పత్తులను తరలించే యత్నాన్ని అడ్డుకున్నారు. దోహా పోర్టు మరియు నార్తర్న్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఓ నౌకలో రహస్యంగా దాచిన 1,650 కిలోల నమిలే పొగాకుతో పాటు 22,005 సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం, సుంకాలను ఎగవేయడంతో పాటు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నౌకలో ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరల్లో ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను దాచినట్లు గుర్తించారు.ఈ ఘటన ఖతార్ కస్టమ్స్ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ రవాణా యత్నమని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకుపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







