తెలంగాణ సంక్షేమ రంగంలో నెంబర్ వన్గా : కేసీఆర్
- August 14, 2016
సంక్షేమ రంగంలో తెలంగాణ నెంబర్ వన్గా దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉంటామని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది నుంచే బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని, వారం రోజుల్లో 20 గురుకులాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. బాలారిష్టాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వర్సిటీ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నాలుగు నెలల్లో ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ తీసుకువచ్చే చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. పేద బ్రాహ్మణులకు బడ్జెట్లో రూ. 100 కోట్లు, చిన్న, సన్నకారు రైతులకు 100శాతం సబ్సిడీని కల్పించామన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









