తెలంగాణ సంక్షేమ రంగంలో నెంబర్ వన్గా : కేసీఆర్
- August 14, 2016
సంక్షేమ రంగంలో తెలంగాణ నెంబర్ వన్గా దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉంటామని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది నుంచే బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని, వారం రోజుల్లో 20 గురుకులాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. బాలారిష్టాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వర్సిటీ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నాలుగు నెలల్లో ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ తీసుకువచ్చే చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. పేద బ్రాహ్మణులకు బడ్జెట్లో రూ. 100 కోట్లు, చిన్న, సన్నకారు రైతులకు 100శాతం సబ్సిడీని కల్పించామన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







