50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- July 31, 2026
అబుదాబి: యూఏఈలో తీవ్ర ఎండలు కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలను మరింత పెంచేందుకు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాలను చేపట్టింది. అనుకూలమైన మేఘాలు కనిపించిన ప్రతిసారి గత కొన్ని రోజులుగా క్లౌడ్ సీడింగ్ నిర్వహించినట్లు ఎన్సీఎం వెల్లడించింది. సహజసిద్ధంగా ఏర్పడే వర్షపాతాన్ని మరింత పెంచి, నేలపై పడే వర్షపు చినుకుల పరిమాణాన్ని అధికం చేయడమే క్లౌడ్ సీడింగ్ లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఎన్సీఎం ప్రకారం.. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలు, అల్ ఐన్ పరిసరాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
50 డిగ్రీల వేడిలో వర్షాలు ఎలా?
ఇటీవలి రోజుల్లో యూఏఈలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఇంతటి వేడిలో వర్షాలు కురవడం అసాధారణంగా కనిపించినప్పటికీ, అధిక ఉష్ణోగ్రతలు నేల వేడిని పెంచి కన్వెక్టివ్ మేఘాలు ఏర్పడేందుకు దోహదపడతాయని వాతావరణ నిపుణులు వివరించారు. అయితే వేడి ఒక్కటే వర్షాలకు కారణం కాదని, తేమతో కూడిన గాలులు, వాతావరణ అస్థిరత, అనుకూల గాలుల దిశ వంటి అంశాలు కలిసి వచ్చినప్పుడే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇటీవల జూలై 29న భారీ వర్షాలు, దుమ్ము తుఫాన్లు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచిన నేపథ్యంలో ఎన్సీఎం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతకుముందు మసాఫీ, అల్ ఐన్ ఉత్తర ప్రాంతాల్లో వర్షాలతో పాటు వడగళ్ల వాన కూడా నమోదైంది. అలాగే జూలై 28న దేశంలోని పలు ప్రాంతాలకు వర్షాలు, దుమ్ము తుఫాన్ల హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు







