ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- July 31, 2026
మస్కట్: మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒమన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 2025లో అమల్లోకి వచ్చిన మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం ప్రకారం మానవ అక్రమ రవాణా కేసుల్లో దోషులుగా తేలిన వారికి మూడు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, 5,000 నుంచి 100,000 ఒమానీ రియాల్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
నేరం పిల్లలకు సంబంధించినదైతే, వ్యవస్థీకృత నేర ముఠా పాల్పడితే లేదా ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లయితే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏడు నుంచి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు చట్టంలో నిబంధనలను పొందుపరిచారు. అంతేకాకుండా, నేరానికి ఉపయోగించిన ఆస్తులు, పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు మానవ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తేలిన కంపెనీల కార్యకలాపాలను నిలిపివేసే అధికారాన్ని కూడా కోర్టులకు కల్పించారు.
జూలై 30న నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ చట్టంలోని శిక్షలను రాయల్ ఒమాన్ పోలీస్ గుర్తు చేసింది. బాధితుల రక్షణ, నేరస్థులపై కఠిన చర్యలు, మానవ అక్రమ రవాణా అన్ని రూపాలను అరికట్టడంలో ఒమాన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..
- రేపే ఏపీకి ప్రధాని మోదీ..
- సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం
- మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!







